Friday, 2 December 2016

ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతం…

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు…హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది…



 ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు… ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు…ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు… తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు… హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి…


అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు… ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది.. అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది… ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట… చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట… ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు… ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది… మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి…

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి

సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః



* ధ్యానం :
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే



షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే




* షష్టిదేవి స్తోత్రం :
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః



కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః




ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః



ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే




వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః


రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

వంటింటి చిట్కాలు మీ అందరి కోసం.Kitchen tips for everyone.

 కాకరకాయ వండేటప్పుడు, పచ్చి మామిడి కాయల ముక్కలను చేర్చితే, చేదు తగ్గడంతో పాటు, కూరకు కొత్త రుచి జత చేరుతుంది.
* కరివేపాకును నూనెలో కరకరలాడే వరకు వేయించి, చల్లారాక వడకట్టి సీసాలో భద్రపరుచుకుంటే, కావలసినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. కూరలు వండి దించేటప్పుడు ఈ పొడి కాస్త చిలకరిస్తే కరివేపాకు వేసి వండిన ఫలితం దక్కుతుంది.




* గాజు గ్లాసులు శుభ్రం చేసే నీటిలో కొద్దిగా బట్టలకు పెట్టే బ్లూ కలిపితే, మరకలు గ్లాసులను సమూళంగా వదిలి తలతల్లాడుతాయి.
* కంప్యూటర్ కీ బోర్డ్, కంప్యూటర్, మౌస్లపై మరకలను, నెయిల్ పాలిష్ లో ముంచిన దూదితో తేలికగా తొలగించవచ్చు.
* పాత్రల పై అతికించిన లేబుల్స్, స్టిక్కర్స్ ను క్యాండిల్ వెలిగించి వేడిచేస్తే తేలికగా ఊడి వస్తాయి.




* సిరంజి నీడిల్స్ తో గ్యాస్ స్టవ్ బర్నర్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు.
* ఫ్రిజ్ లో ఉంచిన క్యాండిల్స్, బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి.




* సమోసాలు వండినప్పుడు పిండికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే, సమోసాలు కరకరకలాడుతాయి.
* ఆకు కూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, తడిబట్టలను ఆకు కూరలకు చుట్టి ఫ్రిజ్ లో ఉంచాలి.
* పేస్ట్రీస్ పప్పీగా ఉండాలంటే, పిండి కలిపేటప్పుడు నీళ్ళకు బదులుగా సోడా ఉపయోగించాలి.



* వేసవి కాలంలో గుడ్లు పాడవకుండా ఉండాలంటే, గుడ్ల పై నూనె రాయాలి.
* కొత్తిమీల, కరివేపాకులను మస్లిన్ క్లాత్ లో చుట్టి, ఫ్రిజ్ లో నిలువ చేస్తే ఎక్కువ కాలం తాజా గా ఉంటాయి.

జీడిపప్పు వల్ల 30 సంవత్సరాలు దాటిన మహిళలకు మేలేంత. తప్పక మీరు తినాలి.

జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.
ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.

ఆంజనేయ స్వామికి “సింధూరం” అంటే ఎందుకు అంత ఇష్టం.?

పూర్వం శ్రీరామపట్టాభిషేకము అనంతరం సీతమ్మ తల్లి తలంటు స్నానము చేసినుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా …. తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా … ఇప్పుడు రావద్దు …” అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా… మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు.
హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.
హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ” హనుమా ! ఇదేమిటి” అని అడగగా, హనుమంతుడు “మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికేడుకే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.
హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు.ఈ విధంగా ఆంజనేయస్వామి కి సింధూరం అంటే ప్రీతి

అసలు శివుని యొక్క ఆత్మలింగం ఎందుకు (గోకర్ణ లో) గణపతి చేతుల మీదుగా భుమిమీద పెట్టబడింది?

భూగోళం పై సృష్టి జరగకముందు మొత్తం భూమిని ఆవరించి ‘సముద్రుడు’ ఉండేవాడు. ఎక్కడా కుడా ఇసుమంతైనా భూభాగం కనిపించేది కాదు. దేవతలు సముద్రుడికి భూగ్రహాన్ని నివాసంగా ఇవ్వడం జరిగింది. అటువంటి సమయంలో దేవలోకంలో ఉన్న బ్రహ్మ సృష్టి జరగాలనీ, అదికూడా మహాశివుని ద్వారా జరగాలనీ, అదికూడా ‘భూమి’ మీద సముద్రుడి చుట్టుకొలతలతో జరగాలనీ ఆశించాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న సముద్రుడు తను ఆవరించిన చుట్టుకొలతలో కొంతమేర తగ్గించి అక్కడక్కడ భూమి బయటకు కనిపించే విధంగా తన రూపాన్ని అమర్చుకున్నాడు. అంతట పరమశివుడు మరణము సంభవించనీ, సమానగుణములూ, సత్వగుణములు కలిగిన మానవజాతిని సృస్టించడానికి కావలసిన శక్తి కోసం పాతాళలోకంలో ఒకానొక శుభదినాన్న తపస్సు ప్రారంభిస్తాడు. ఆవిషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ సృష్టి అంటే ‘చరాచర’ జగత్తు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ ఒకదానిమీద మరొకటి ఆధారపడేలా ఉండాలి కాని సృష్టి అంటే సమాన జగత్తు కాదనీ, 5 భిన్న సముదాయాల సమ్మేళనమే (పంచ భూతాలు) సృష్టి అనీ, శివుని తపస్సు అందుకు భిన్నంగా ఉందనీ “నేనొకటి తలిస్తే శివుడొకటి తలుస్తున్నాడని” అందరిలో (తను కలిసిన వారందరితో) చెబుతాడు. ఆ విషయాన్ని పాతాళలోకంలో తపస్సులో ఉన్న శివునికి తపోభంగం కలిగించి మరీ చెబుతుంది ‘ప్రకృతి’.
ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఆవేశంతో అయితే “ఆయన్నే సృష్టి చేసుకోమని” కైలాసం వెళ్ళడానికిగానూ పాతాళలోకం నుండి పైకి వచ్చుటకొరకై చక్రాకార భ్రమణం చేయుచున్న భూమి అడ్డువచ్చుట చూసి “నేను వెళ్ళాలి దారిని వొదులు, అడ్డులే!” అని అరుస్తాడు. అప్పుడు భూమాత వినయంతో “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా, ఎవరిమీద కొపమున్నా దయచేసి నాకు నీ స్పర్శన భాగ్యం కలిగించి, నన్ను భాదింపకుండా సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేసించి, నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళవలసింది” అని దీనంగా స్తోత్ర సహితంగా ప్రార్దించింది. ఆస్తోత్రాన్ని విన్న రుద్రుడు శాంతించి అంగుష్టమాత్ర శరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చి ఆనందంతో “నీకు గల మరొక పేరు (భూమికి గల మరొక పేరు) ‘గో’, ఇది నీ కర్ణ ప్రదేశం కనుక ఇకనుండి ఈ సుందర ప్రదేశం “గోకర్ణ” గా ఖ్యాతి పొందుతుంది. ముందు యుగాలలో ఇక్కడ గోకర్ణ ఆకారంలో, “గోకర్ణేశ్వరుడనే మహాబలేశ్వరుడు ఆత్మలింగంగా”స్థాపింపబడతాడు. అశ్వనీదేవతల పై నాకుగల ప్రేమను చాటడంకోసం ఈ పేరులో అంతర్లీనము గా ఉన్న గోకర్ణ (ఆవుచెవి – ఆవు చెవిలో అశ్వనీ దేవతలుంటారు) ఆకారం లోనే గోకర్ణేశ్వరుడు ఉంటాడు. ఈ ప్రాంతం అనేక గోవులకు ఆలవాలమై ఉంటుంది. నేను పాతాళం నుండి బయటకు వెళ్ళునప్పుడు ఈ ప్రదేశం “యోని” లాగా నాకు కనిపించినందున ఈ ప్రాంతాన్నే “రుద్రయోని / విశ్వయోని” అనీ, ప్రళయకాలంలో భూమిపై గల సముద్రుడు ఇక్కడే “సుడి” తిరిగి సృష్టిని తనలో కలిపేసుకుంటాడుగాన దీనికి “వరుణావర్తం” అనీ పేరు వస్తుంది. “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి పొద్దున్న ఉచ్ఛరించిన , గత రాత్రి చేసిన పాపములన్నీ హరించుకుపోవును. అలాగే “గోకర్ణ” నామమును ఇక్కడ ఉండి సాయంత్రం ఉచ్ఛరించిన, పొద్దున్న చేసిన పాపములన్నీ హరించుకుపోవును. ముందు ముందు క్రమంగా ఇక్కడకు మహర్షులూ, దేవతలూ, గంధర్వులూ, యోగులు వచ్చి వారి పాపముల ప్రక్షాళనగావించుకొనెదరు. ఇక్కడికి తీసుకురాబడేవారెవరైనా, ఇక్కడనుండి తీసుకుపోబడేవాడేవడైనా (ఇక్కడ మరణం పొందినవారు) అత్యంత అదృష్టవంతుడని తలంపుము. ఇక్కడే తాంత్రిక విద్యలు పుడతాయి. వాటిని నిరోధించే హనుమంతుడూ ఇక్కడే పుడతాడు. ఈ ప్రాంతం భూమి మీద గల ప్రత్యేక ప్రాంతంగా, భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక సుఖాలకు కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాంతంలో ముందు ముందు “అఘనాశిని మరియు గంగావళి ” (అఘనాశిని = పాపమును నశింపజేసేది, గంగావళి = గంగతో సమానమైనది) అనే పాపాలను సమూలంగా కడిగే ఈ విశ్వం లోనే గల ఏకైక సముద్ర సంగమసహిత రెండు నదులు పారుతాయి. (కాశి లోని గంగానది సముద్రసంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని మరియు గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో అప్పటివరుకు చేసిన పాపాలూ “శూన్యమవుతాయి”, ఇక్కడికి మునులూ దేవతలూ సైతం వచ్చి సంధ్యవార్చి స్నానం చేసి వెళ్ళవలసిందే!” అని రుద్రుడు భూమికి వరముని ఇచ్చి కైలాసానికేగుతాడు.

ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. దీంతో దృష్టి బాగా వస్తుంది.చూపు బాగా వస్తుంది.


4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.







కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. అరకిలో వాల్ నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.




 ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. అయితే, 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి.




 ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.


పది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ ను తీయాలి. ఈ జ్యూస్ ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీంతో దృష్టి బాగా వస్తుంది.