Friday, 2 December 2016

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు జన్మించాడు

 మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..

పూర్వకాలంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు.

పూర్వకాలంలో అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. ఒకవేళ అవి దొరకకపోతే విస్తరాకుల్లో అయినా ఆహారం భుజించేవారు. ఇప్పుడు ఆ అలవాటు పోయింది. ఎప్పుడో అరకొరగా వాటిని వాడుతున్నారు. శుభకార్యాల్లో కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ ని.. లేదంటే ప్లాస్టిక్ కోటెడ్ విస్తరాకుల్ని వాడుతున్నారు. అయితే యూరప్ లో వాటికి ఎంత డిమాండ్ అంటే అక్కడి ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ లో సైతం విస్తరాకుల్నే వాడుతున్నారట.



మనం వదిలేసిన సంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారన్న మాట. వీటిని మన దేశం నుంచి భారీగా డిమాండ్ చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని దియోగర్, అంగుల్, సంబల్పూర్, కందమాల్ ప్రాంతాల్లోని 130 గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.



మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?




* భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.
అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.

భారతీయ దేశీయ ఆవు పాలు Indian domestic cow milk

1.కొంచెం పలుచగా ఉంటాయి.
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.


7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.



11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.




16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)






23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన ‘స్వర్ణనాడి’ (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని ‘కేసిన్’ అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి




పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును
అందరు షేర్ చేయండి

ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన సంజీవని పర్వతం…

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు…హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది…



 ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు… ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు…ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు… తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు… హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి…


అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు… ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది.. అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది… ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట… చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట… ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు… ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది… మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి…

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రాన్ని పఠించండి

సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః



* ధ్యానం :
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే



షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే




* షష్టిదేవి స్తోత్రం :
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః



కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః




ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః



ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే




వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః


రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

వంటింటి చిట్కాలు మీ అందరి కోసం.Kitchen tips for everyone.

 కాకరకాయ వండేటప్పుడు, పచ్చి మామిడి కాయల ముక్కలను చేర్చితే, చేదు తగ్గడంతో పాటు, కూరకు కొత్త రుచి జత చేరుతుంది.
* కరివేపాకును నూనెలో కరకరలాడే వరకు వేయించి, చల్లారాక వడకట్టి సీసాలో భద్రపరుచుకుంటే, కావలసినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. కూరలు వండి దించేటప్పుడు ఈ పొడి కాస్త చిలకరిస్తే కరివేపాకు వేసి వండిన ఫలితం దక్కుతుంది.




* గాజు గ్లాసులు శుభ్రం చేసే నీటిలో కొద్దిగా బట్టలకు పెట్టే బ్లూ కలిపితే, మరకలు గ్లాసులను సమూళంగా వదిలి తలతల్లాడుతాయి.
* కంప్యూటర్ కీ బోర్డ్, కంప్యూటర్, మౌస్లపై మరకలను, నెయిల్ పాలిష్ లో ముంచిన దూదితో తేలికగా తొలగించవచ్చు.
* పాత్రల పై అతికించిన లేబుల్స్, స్టిక్కర్స్ ను క్యాండిల్ వెలిగించి వేడిచేస్తే తేలికగా ఊడి వస్తాయి.




* సిరంజి నీడిల్స్ తో గ్యాస్ స్టవ్ బర్నర్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు.
* ఫ్రిజ్ లో ఉంచిన క్యాండిల్స్, బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి.




* సమోసాలు వండినప్పుడు పిండికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే, సమోసాలు కరకరకలాడుతాయి.
* ఆకు కూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, తడిబట్టలను ఆకు కూరలకు చుట్టి ఫ్రిజ్ లో ఉంచాలి.
* పేస్ట్రీస్ పప్పీగా ఉండాలంటే, పిండి కలిపేటప్పుడు నీళ్ళకు బదులుగా సోడా ఉపయోగించాలి.



* వేసవి కాలంలో గుడ్లు పాడవకుండా ఉండాలంటే, గుడ్ల పై నూనె రాయాలి.
* కొత్తిమీల, కరివేపాకులను మస్లిన్ క్లాత్ లో చుట్టి, ఫ్రిజ్ లో నిలువ చేస్తే ఎక్కువ కాలం తాజా గా ఉంటాయి.

జీడిపప్పు వల్ల 30 సంవత్సరాలు దాటిన మహిళలకు మేలేంత. తప్పక మీరు తినాలి.

జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.
ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.