4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.
కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. అరకిలో వాల్ నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. అయితే, 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి.
ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.
పది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ ను తీయాలి. ఈ జ్యూస్ ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీంతో దృష్టి బాగా వస్తుంది.



