Wednesday, 30 November 2016

భర్తలను కొట్టడంలో భారతీయ భార్యలది మూడో ర్యాంక్

గృహ హింస అంటే అందరికీ మహిళలే గుర్తుకొస్తారు. భర్తల చేతుల్లో హింసకు గురయ్యే సంఘటనల గురించే అందరూ చర్చింకుంటారు. అయితే గృహ హింసకు లింగ భేదం లేదని… ఆడ,మగ తేడా లేకుండా అందరూ హింసకు గురవుతున్నారంటున్నాయి తాజా రిపోర్టులు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్ట్ ఒకటి ఈ విషయాన్నే తెలుపుతోంది.







మాటకు మాట అనుకోవడం.. మగాళ్లైతే చేతికి పని చెప్పడం.. ఆడాళ్లైతే గరిటెలు, చీపుర్లతో విరుచుకుపడటం కూడా షరామామూలే. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఆడాళ్లదే పై చేయి అవుతోంది. భార్యా బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో ఈజిప్టు, ఇంగ్లాండ్, భారత్ లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి.





భర్తలను తిట్టడం, కొట్టడంలో ఈజిప్టు మహిళలు ఫస్ట్ ర్యాంకు కొట్టేశారు. రెండో ర్యాంకులో బ్రిటన్ మహిళలు సాధిస్తే.. ఇండియా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఆయా దేశాల ఫ్యామిలీ కోర్టుల్లోని కేసులను పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయి.



ఈజిప్టులో 66 శాతం మంది మహిళలు భర్తలను చితకొట్టి విడాకులు తీసుకుంటున్నారట. ఇక భారతీయ మహిళలైతే చేతికి దొరికిన సూదులు, చీపురులు, గరిటెలు, గిన్నెలు, కిచెన్ నైవ్స్ , చెప్పులతో దాడులు చేస్తున్నారట. కోర్టుల్లో భార్యాబాధితుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపింది ఆ నివేదిక.
.


No comments:

Post a Comment